రాష్ట్రాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. కొన్ని రాష్ట్రాలలో ఇంకా ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయకపోవడంపై అసహనాన్ని వ్యక్తం చేసింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ వేగవంతంపై సుప్రీంలో సోమవారం విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఈసీకి నోటీసులు జారీ చేసిన కోర్టు.. తదుపరి విచారణను మార్చి4కు వాయిదా వేసింది.