దేశంలో జరుగుతున్న తొలివిడత లోక్సభ ఎన్నికల పోలింగ్పై ప్రధాని మోదీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘2024 లోక్సభ ఎన్నికలు ఇవాళ్టి నుంచి ప్రారంభం! 21 రాష్ట్రాలు, యూటీలలో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నందున, ఈ స్థానాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని నేను కోరుతున్నాను. యువకులు, మొదటిసారి ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు వేయాలని నేను ప్రత్యేకంగా పిలుపునిస్తున్నాను’ అని పేర్కొన్నారు.