హిమాచల్ప్రదేశ్ను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ధర్మశాల, పాలాంపూర్ ప్రాంతాల్లో ఏకంగా 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్, మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 150 రోడ్లను అధికారులు మూసేశారు. పర్యాటకులు ప్రస్తుతానికి రాష్ట్రానికి రావొద్దని సూచించారు. అత్యవసర సహాయక చర్యల బలగాలను కేంద్రం సిద్ధంగా ఉంచింది.