అమిత్ షా సభకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజారుకాకపోవడం ఆ పార్టీ
శ్రేణుల
ను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇటీవల గోషామాహల్ నియోజకవర్గంలో కిషన్ రెడ
్డి నిర్వహించిన విజయ సంకల్ప యాత్రకు కూడా రాజాసింగ్ దూరంగా ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మహిళను ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ఈ పరిణామాలు పార్టీ సొంత నేతలను షాక్కు గురిచేస్తున్నాయి. రాజాసింగ్ దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయి.