గుజరాత్లోని రాజ్కోట్ గేమ్జోన్ ప్రమాద మృతుల సంఖ్య 32కు చేరింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. శనివారం సాయంత్రం రాజ్కోట్లోని టీఆర్పీ గేమ్జోన్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. కాగా, ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని రాష్ట్ర హోంమంత్రితో కలిసి సీఎం భూపేంద్రపటేల్ ఆదివారం పరిశీలించి ప్రమాద కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను పరామర్శించారు.