అంగరంగ వైభవంగా రామయ్య కళ్యాణ మహోత్సవం

84చూసినవారు
అంగరంగ వైభవంగా రామయ్య కళ్యాణ మహోత్సవం
శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాచలంలో వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రాములోరి కల్యాణోత్సవం కనులపండువగా సాగింది. అభిజిత్‌ లగ్నంలో జగన్మాత సీతమ్మ మెడలో శ్రీరామచంద్రుడు మాంగల్య ధారణ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎస్ శాంతికుమారి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవదేవుడికి కల్యాణాన్ని భక్తజనం కనులారా వీక్షించి పులకించింది. భక్తుల రామనామస్మరణ మధ్య జానకమ్మను జగదభిరాముడు మనువాడారు.

సంబంధిత పోస్ట్