ఎండలు ముదురుతున్నాయి. పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి. రాగల ఐదు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు మంగళవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం నెలకునే అవకాశం ఉన్నట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.