నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు బీజేపీ నుంచి పార్లమెంట్కు పోటీ చేస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా నరసాపురం టికెట్ను శ్రీనివాస వర్మకు బీజేపీ కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆయనకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ గోదావరిలోని ఏదైనా అసెంబ్లీ సీట్లో ఎవరినైనా పోటీకి ఆపి.. రఘురామను బరిలో నిలుపనున్నట్లు సమాచారం.