యూసూఫెయిన్ దర్గాలో డిప్యూటీ మేయర్ ప్రత్యేక పూజలు

81చూసినవారు
హైదరాబాద్ నాంపల్లిలోని యూసూఫెయిన్ దర్గాలో గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలిసి చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు మంచి పాలన అందించాలని ప్రార్థనలు చేసినట్లు డిప్యూటీ మేయర్ తెలిపారు.