ఫార్మా కంపెనీల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు: ఎంపీ

65చూసినవారు
ఫార్మా కంపెనీల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు: ఎంపీ
వ్యవసాయాన్నే ఆధారంగా జీవనం కొనసాగిస్తున్న రైతులను ఫార్మా కంపెనీల పేరుతో ఇబ్బంది పెట్టొద్దని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ మేరకు వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో కొనసాగుతున్న ఫార్మా కంపెనీ వ్యతిరేక దీక్షలో పాల్గొని సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. కొడంగల్ ప్రాంత నుంచే గెలిచి సీఎం స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి వెంటనే రైతుల బాధలను విని ఫార్మా కంపెనీని దూర ప్రాంతాలకు తరలిస్తామనే భరోసా కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్