రాష్ట్ర నూతన హైకోర్టు భవనానికి బుధవారం శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ హాజరు కానున్నారు. కొత్త హైకోర్టు నిర్మాణం కోసం హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఉన్న వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీ లోంచి 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే హాజరుకానున్నారు.