రాజేంద్రనగర్ సర్కిల్ నవ యువ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ వర్ధంతి సందర్భంగా బుధవారం మైలర్ దెవ్ పల్లి డివిజన్ పరిధిలో బృందావన్ కాలనీలో చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఏర్వ కుమారస్వామి, ఉపాద్యక్షులు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. శివాజీ దేశ ప్రజలకు స్ఫూర్తి దాయాకమనీ కొనియాడుతూ, వారి ఆశయాలసాధనకై యువత కృషి చేయాలన్నారు.