బోనాలు, బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం విజయవంతం అయ్యేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. జూలై 9న ఎల్లమ్మ కల్యాణం జరగనుంది. ఈ నేపథ్యంలో బుధవారం వివిధ శాఖల అధికారులు, స్థానికులతో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్లమ్మ కల్యాణ ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.