అమ్మవారి ఆశీస్సులతో అంతా సుభిక్షం: మాజీ ఎమ్మెల్యే

62చూసినవారు
అమ్మవారి ఆశీస్సులతో అంతా సుభిక్షం: మాజీ ఎమ్మెల్యే
అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆకాంక్షించారు. శుక్రవారం బోనాల పండుగ నేపథ్యంలో పట్టణంలోని రైతు కాలనీ, విద్యుత్ కాలనీలలో జరిగిన బోనాలకు ప్రత్యేకంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతు కాలనీలో గల కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా విద్యుత్ కాలనీలో భక్తులు తొట్టెలను అమ్మవారికి సమర్పించగా ఈ కార్యక్రమానికి అంజయ్య యాదవ్ హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్