మహిమాన్విత, కోట మైసమ్మ తల్లి దివ్య ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేను అయ్యానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. బుధవారం నందిగామ మండలం రంగాపూర్ గ్రామంలో కోట మైసమ్మ దేవాలయం వార్షికోత్సవ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరై పూజలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంగాపూర్ తనకు దేవుడిచ్చిన బంధమని, ఆ బంధాన్ని, బలగాన్ని మర్చిపోలేనని, నాయకుడిలా కాకుండా సేవకుడిలా పని చేస్తామన్నారు.