ప్రాజెక్టుల పేరిట మాజీ సీఎం కేసీఆర్ వేల కోట్ల రూపాయల స్కాం కు తెరలేపారని సోమవారం షాద్నగర్ పర్యటనలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు రాజకీయ బిక్ష పెట్టిన పాలమూరుకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ భారీ అప్పుల ఊబిలో నెట్టివేశారని ఫైర్ అయ్యారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు తమ ప్రభుత్వంలో మొదటి తారీఖున జీతాలు వేస్తున్నామని గుర్తుచేశారు.