అనుమానాస్పద స్థితిలో నవీన్ మృతి

76చూసినవారు
అనుమానాస్పద స్థితిలో నవీన్ మృతి
ఉప్పల్ నియోజకవర్గం సాయిబాబా నగర్ విజయపురి కాలనీకి చెందిన నవీన్(40) కు భార్య, పిల్లలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో పిల్లలను తీసుకుని భార్య పుట్టింటికి వెళ్ళింది. దానితో ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. ఆ ఇంట్లో నుండి దుర్వాసన రావడంతో కాలనీవాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి చూడగా నవీన్ మృతి చెంది ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్