

వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి.. నలుగురు పోలీసులకు గాయాలు
AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తిరునాళ్లలో పోలీసులపై దాడి జరిగింది. వైసీపీ కార్యకర్తలు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. రాళ్ల దాడిలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయమైంది. పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడినట్లు సమాచారం.