ఇండియన్ సైబర్ క్రైమ్ కోర్డినేషన్ సెంటర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక

76చూసినవారు
హీరోయిన్ రష్మిక ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్(I4C)కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన సైబర్‌ దోస్త్ విభాగం ప్రకటించింది. ఈ మేరకు రష్మిక కూడా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో గతంలో తాను ఎదుర్కొన్న డీప్‌ ఫేక్‌ గురించి ప్రస్తావించారు. ప్రతి ఒక్కరికి సైబర్‌ క్రైమ్‌పై అవగాహన తీసుకురావాలన్నదే తన లక్ష్యం అని పేర్కొంది.

సంబంధిత పోస్ట్