రికార్డు సృష్టించిన ఆర్సీబీ

66చూసినవారు
రికార్డు సృష్టించిన ఆర్సీబీ
ఐపీఎల్-2024లో వరుసగా 5 మ్యాచులు గెలిచిన జట్టుగా ఆర్సీబీ రికార్డు సృష్టించింది. ఆదివారం ఢిల్లీపై 47 రన్స్ తేడాతో గెలిచి ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. తొలి 8 మ్యాచుల్లో ఒకటే విజయం సాధించిన బెంగళూరు, ఆ తర్వాత జరిగిన 5 మ్యాచుల్లోనూ గెలుపొందింది. జీటీ(2 సార్లు), ఎస్ఆర్‌హెచ్, పీబీకేఎస్, డీసీ జట్లను చిత్తుచేసింది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈనెల 18న చెన్నైతో కీలక పోరులో తలపడనుంది.

సంబంధిత పోస్ట్