యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ఎస్వీ ల్యాబ్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ వద్ద లీకేజీ అవడంతో ప్లాంట్ ఇన్ఛార్జ్ నాగరాజు (34) మృతి చెందాడు. అలాగే పరిశ్రమలో పని చేస్తున్న మరో ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని హైదరాబాద్ లోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.