ఆ దేశంలో 481 ఎలుగుబంట్లను చంపేందుకు రెడీ.. ఎందుకో తెలుసా?

75చూసినవారు
ఆ దేశంలో 481 ఎలుగుబంట్లను చంపేందుకు రెడీ.. ఎందుకో తెలుసా?
రొమేనియా దేశంలో దాదాపు 8 వేల ఎలుగుబంట్లు ఉండగా వాటిలో 481ఎలుగుబంట్లను చంపేందుకు పార్లమెంటు ఆమోదించింది. గత 20 ఏళ్లలో 26 మంది ఎలుగుబంట్ల దాడుల్లో చనిపోగా, 274 మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా, 19 ఏళ్ల పర్వాతారోహకుడిపై దాడి చేయడంతో అతడు మరణించాడు. ఎలుగుబంట్ల జనాభా గణనీయంగా పెరగడం వల్లే మనుషులపై దాడులు జరుగుతున్నాయని భావించిన ప్రభుత్వం వాటిని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది 220 ఎలుగుబంట్లను హతమార్చింది.

సంబంధిత పోస్ట్