తెలంగాణలో కౌలు రైతులకు కూడా రైతుభరోసా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై కేబినెట్ సబ్కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున పెట్టుబడిసాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొంది. అయితే, కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారనేది ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, కౌలు రైతులు 25 లక్షల వరకు ఉంటారని అంచనా.