టీ20 ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ తో టీమిండియా సెమీస్ పోరులో తలపడనుంది. ఈ టోర్నీలో అద్భుతంగా రాణిస్తున్న బుమ్రాను మరో పేసర్ అర్ష్దీప్ సింగ్ కొనియాడాడు. “బుమ్రాతో కలిసి బౌలింగ్ చేయడం ఎప్పుడూ కష్టం కాదు. అతడు వీడియో గేమ్ లా బౌలింగ్ చేస్తాడు. కేవలం రెండు, మూడు పరుగులే ఇస్తాడు. దీంతో బ్యాటర్లు ఒత్తిడిలోకి వెళ్తారు. ఆ తర్వాత రిస్కీ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తారు”అని అర్ష్దీప్ తెలిపాడు.