అరుణాచల్ ప్రదేశ్‌‌లో రెడ్ అలర్ట్ జారీ

71చూసినవారు
అరుణాచల్ ప్రదేశ్‌‌లో రెడ్ అలర్ట్ జారీ
రాబోయే రెండు రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులను సంప్రదించాలని ముఖ్యమంత్రి పెమా ఖండూ కోరారు. వాతావరణ శాఖ కొండచరియల విషయంలో హెచ్చరించింది. ముఖ్యంగా పపుమ్ పారే, పశ్చిమ కమెంగ్ జిల్లాల్లోని కొన్ని ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్