కర్ణాటకలో కొందరు వైద్య విద్యార్థులు ఏకంగా ఆస్పత్రిలోనే రీల్స్ చేశారు. గడగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (GIMS)లో చదువుతున్న 38 మంది విద్యార్థుల ట్రైనింగ్ మరో 20 రోజుల్లో ముగియనుంది. వీరు ఆస్పత్రిలోనే రీల్స్ చేశారు. ఈ వీడియో కాస్త వైరల్గా మారడంతో.. విద్యార్థుల చర్యపై GIMS డైరెక్టర్ డాక్టర్ బసవరాజ్ సీరియస్గా స్పందించారు. వారికి జరిమానాతో పాటు.. ట్రైనింగ్ను మరో 10 రోజులు పొడిగించినట్లు తెలిపారు.