ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు EPFO వెసులుబాటు కల్పించింది. ఆధార్ అనుసంధానం కాకపోవడంతో క్షేత్రస్థాయిలోని కార్యాలయాల్లో కాగితరూప క్లెయిమ్లు పరిశీలించలేకపోతున్నామని, దీంతో చందాదారులకు సకాలంలో క్లెయిమ్లు అందడంలేదని ఈపీఎఫ్వో అధికారులు కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాలను పరిశీలించిన కేంద్ర కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది.