విదేశీ పర్యటనను ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయానికి వెళ్లనున్నారు. నేడు లేదా రేపు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి దావోస్ లో వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల వివరాలను ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది. కాగా డబ్ల్యూఈఎఫ్ సదస్సులో దాదాపు రూ.40,232కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఎంవోయూలు కుదుర్చుకుంది.