తెలంగాణలో కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ అయిదు రోజుల ఢిల్లీ టూర్ పూర్తయింది. మంత్రివర్గ విస్తరణతో పాటుగా టీపీసీసీకి కొత్త అధ్యక్షుడు..నామినేటెడ్ పదవుల భర్తీ పైన పార్టీ నాయకత్వంతో రేవంత్ చర్చలు చేసారు. ప్రధానంగా టీపీసీసీ చీఫ్ విషయంలో రేవంత్ ఇద్దరి పేర్లను సిఫార్సు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ లేక మహబూబాబాద్ ఎంపీ బల్రాం నాయక్ పేర్లను రేవంత్రెడ్డి ప్రతిపాదించినట్టు సమాచారం.