నవంబరు నుంచి భూముల ధరల సవరణ

65చూసినవారు
నవంబరు నుంచి భూముల ధరల సవరణ
TG: రాష్ట్రంలో నవంబరు నుంచి భూముల కొత్త మార్కెట్‌ విలువ అమల్లోకి రానుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూముల బహిరంగ ధరలను అధ్యయనం చేసిన స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మార్కెట్‌ విలువను సవరించే ప్రక్రియను దాదాపు పూర్తిచేసింది. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి త్వరలోనే నివేదిక అందించనుంది. అనంతరం కొత్త మార్కెట్‌ విలువను ప్రభుత్వం అమల్లోకి తీసుకురానుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో అమలవుతున్న ధరలు దాదాపు కొనసాగే అవకాశాలున్నట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్