T20WCలో పాకిస్థాన్ అమెరికా చేతిలో ఓడటం, పేలవ ప్రదర్శనతో గ్రూప్ దశలోనే ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టు సెలక్షన్ కమిటీ నుంచి వాహబ్ రియాజ్, అబ్దుల్ రజాక్లను తప్పించినట్లు తెలుస్తోంది. T20WCకు జట్టును ఎంపిక చేసిన ఏడుగురు సభ్యుల కమిటీలో వీరిద్దరు ముఖ్య పాత్ర పోషించారు. కాగా సెలక్షన్స్ ప్రక్రియలో సెలక్టర్ల మధ్య అభిప్రాయ భేదాలు వ్యక్తమైనట్లు బోర్డు గుర్తించింది.