గుజరాత్లోని అహ్మదాబాద్లో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. రాజ్కోట్ నుంచి దాహూద్ వెళ్తున్నటెంపో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాజ్కోట్ కు చెందిన షాహిద్ భాయ్, నర్సింగ్ భాయ్ అనే ఇద్దరు మృతి చెందగా మోహన్ భాయ్, కేవల్ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.