ఐపీఎల్ 2025లో జైపూర్ వేదికగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ జట్టు స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీ సాధించారు. రాజస్థాన్ బౌలర్లపై దూకుడుగా ఫిల్ సాల్ట్ 28 బంతుల్లో 50 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్లో కెరీర్లో ఫిల్ సాల్ట్కు ఇది 8వ అర్థశతకం. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోర్ 82/0గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (22), ఫిల్ సాల్ట్ (59) ఉన్నారు.