కువైట్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: కేంద్రం

67చూసినవారు
కువైట్ మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం: కేంద్రం
కువైట్‌లో అగ్నిప్రమాద దుర్ఘటనపై ప్రధాని మోడీ సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో ప్రధాని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు, మృత దేహాలను త్వరితగతిన స్వదేశానికి రప్పించేందుకు కువైట్‌కు వెళ్లనున్నారు. మరణించిన భారతీయ పౌరుల కుటుంబాలకు ప్రధాన మంత్రి సహాయ నిధి నుండి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

సంబంధిత పోస్ట్