తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని కొందరు కేటుగాళ్లు నయా మోసానికి తెరతీశారు. హయత్నగర్ బంజారాకాలనీకి చెందిన నలుగురు ఆకాశం నుంచి పడిన శక్తుల పెట్టె అంటూ ప్రజలను మోసం చేయాలని చూశారు. ఈ పెట్టెను రూ .50 కోట్లకు వరంగల్కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేస్తారనే సమాచారంతో హైదరాబాద్-వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో జనగామలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా వీరు పట్టెతో పట్టుబడ్డారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.