ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. అక్కడి పరిస్థితులపై RSS చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. నాగ్పూర్లోని ఓ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. మణిపూర్కు ప్రాధాన్యత ఇవ్వాలని.. హింసను అరికట్టాలని కోరారు. సమాజంలో ఘర్షణలు మంచివి కావని.. శాంతిస్థాపన ముఖ్యమని చెప్పుకొచ్చారు. ఉద్రిక్త పరిస్థితులను ప్రభుత్వాలు ప్రాధాన్యంతో పరిష్కరించాలని అన్నారు.