ఏపీలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ హిందూపురంలో ప్రారంభమైంది. నిన్న పుట్టిన రోజు సందర్భంగా రూ.5కే ఆహారం అందించే ఈ క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పునఃప్రారంభించారు. బాలకృష్ణ స్వయంగా వడ్డించి వృద్ధులకు ఆహారం పంపిణీ చేశారు. కాగా, టీడీపీ అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించారు.