యూపీలోని అలీఘర్లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. కదులుతున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని ప్రయాణికులు ఆందోళన చెందారు. ప్రాణభయంతో బస్సు నుంచి దిగి పరుగులు పెట్టారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఎండల వల్ల ఇలా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. దీంతో పగటి పూట ప్రయాణాలు చేయాలంటే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.