నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) డైరెక్టర్ జనరల్గా సదానంద్ వసంత్ దాతేను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ చీఫ్గా సేవలందిస్తున్నారు. ప్రస్తుతం ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా ఉన్న దినకర్ గుప్తా పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ క్రమంలో ఆయన స్థానంలో సదానంద్ వసంత్ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.