అక్కడ కొలువైన అమ్మవారికి శిరస్సు ఉండదు.. ఎందుకంటే..?

76చూసినవారు
అక్కడ కొలువైన అమ్మవారికి శిరస్సు ఉండదు.. ఎందుకంటే..?
ప్రతి ఆలయంలోనూ విగ్రహానికి శిరస్సు నుంచి పాదాల వరకు పూర్తి రూపం ఉంటుంది. కానీ విశాఖ జిల్లాలో కొలువైన ఎరుకుమాంబ అమ్మవారి విగ్రహానికి శిరస్సు అనేదే ఉండదు. స్థల పురాణం ప్రకారం.. గౌరీ స్వరూపమైన ఈ అమ్మవారి విగ్రహాన్ని ఎద్దులబండి మీద ఉంచి తీసుకొస్తున్నప్పుడు.. అది ఆగిన చోట అమ్మవారికి ఆలయం కట్టాలని అప్పటి పెద్దలు నిర్ణయించుకున్నారట. ఆ సమయంలోనే అమ్మవారి విగ్రహం నుంచి శిరస్సు వేరు పడిందట. అలా వేరు పడిన శిరస్సు అతికించేందుకు ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదట.

సంబంధిత పోస్ట్