ఏప్రిల్, మే నెల పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు ఆథరైజేషన్ పత్రాలు తీసుకోవాలని సెర్ప్ సర్క్యులర్ జారీ చేసింది. ఎన్నికల కోడ్ దృష్ట్యా బ్యాంకుల నుంచి నగదు తీసుకెళ్లే సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల వద్ద ఆథరైజేషన్ పత్రం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శి, సంక్షేమ కార్యదర్శులకు ఆథరైజేషన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. పింఛను పంపిణీ సమయంలో ప్రచారం చేయకూడదని పేర్కొంది.