మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లా ముంగావలిలో ఇటీవల ఓ తల్లి తన నలుగురు పిల్లలను కోల్పోయింది. పసిపాపను ఆస్పత్రికి తీసుకురాగా.. హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసిన 2 రోజులకే పాప మృతి చెందింది. అంతకుముందు ముగ్గురు చిన్నారులు సరైన చికిత్స అందక మరణించారు. మరో పసికందు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నా అధికారులు సరిగా స్పందించకపోవడం గమనార్హం. ఈ విషాద ఘటన దేశంలోని వైద్య వ్యవస్థ లోపానికి నిదర్శనం.