సంగారెడ్డి పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియాను మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలి ఆరుగురు కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న మంత్రి సురేఖ తీవ్ర దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. బుధవారం ఆమె సంఘటనా స్థలాన్ని సందర్శించి, ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి ప్రకటించారు.