ఆర్థిక అక్షరాస్యతపై అవగాహణ సదస్సు

1055చూసినవారు
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహణ సదస్సు
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని సుక్కల్ తీర్థ్ గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత పై శుక్రవారం అవగాహన సదస్సును కంగ్టి బ్రాంచ్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ మేనేజర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విభూది బ్రదర్స్ కళాజాత బృందం వారిచే బ్యాంక్ ద్వారా అందే పలు పథకాలు, సేవలను ఆట, పాట రూపంలో అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్