నల్ల పోచమ్మకు ప్రత్యేక మంగళహారతి

551చూసినవారు
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ దేవాలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలు, గంగాజలంతో అభిషేకం, కుంకుమార్చన పూజలు చేశారు. అనంతరం నుదుట పసుపు కుంకుమ తిలకం దిద్ది, పట్టు వస్త్రాలు సమర్పించి, పలు ద్రవ్యాలు, వివిధ రకాల సుగంధ పుష్పాలంకరణ చేశారు. అనంతరం ప్రధాన అర్చకులు శ్రీకాంత్ స్వామి అమ్మవారికి హారతి సమర్పించి నైవేద్యం నివేదన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్