గుర్తు తెలియని వాహనం ఢీ.. జింక మృతి

1915చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీ.. జింక మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని వన్యప్రాణి జింక మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడం వలన జింక మృతి చెందినట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి వన్యప్రాణి జింకకు పోస్టుమార్టం నిర్వహించి, దహన సంస్కరణలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్