రేపు ఉత్తరా నక్షత్ర వేడుకలు

577చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని శ్రీ నవరత్నాలయ దేవస్థానంలో ఈనెల 26వ తేదీన ఉత్తర నక్షత్ర వేడుకలు నిర్వహిస్తున్నట్లు శ్రీ మణికంఠ అయ్యప్ప ఉత్సవ కమిటీ సభ్యులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు, 8 గంటలకు పల్లకి సేవ జరుగుతుందని చెప్పారు. రాత్రి 7 గంటలకు అష్టాదశ సోపాన మహా పడిపూజ కార్యక్రమం జరుగుతుందని వివరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్