AP: తనని ప్రేమించి మోసం చేశాడంటూ నెల్లూరు జిల్లా సంగం మసీదు సెంటర్లో లక్ష్మి అనే యువతి ఆందోళనకు దిగింది. షేక్ మన్సూర్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, హైదరరాబాద్లో తనతో ఆరేళ్లు కలిసి ఉన్నాడని పేర్కొంది. అయితే తాజాగా హైదరాబాద్ నుంచి వచ్చి మరో పెళ్లికి సిద్దమయ్యాడని యువతి ఆరోపిస్తుంది. దీంతో లక్ష్మి అతడి ఇంటి ముందు బైఠాయించింది.