2, 400 మంది పోలీసులతో ఎన్నికల బందోబస్తు
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు 2, 400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రూపేష్ శనివారం తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలో 1. 84 కోట్ల రూపాయల నగదు, 5, 101 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. 845 బైండోవర్ కేసులు, రెండు గంజాయి కేసులు పెట్టినట్లు చెప్పారు.