టీడీపీలో చేరుతా: తీగల కృష్ణా రెడ్డి కీలక ప్రకటన

67చూసినవారు
టీడీపీలో చేరుతా: తీగల కృష్ణా రెడ్డి కీలక ప్రకటన
త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతానని మాజీ మేయర్ తీగల కృష్ణా రెడ్డి ప్రకటించారు. ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలతో కలిసి సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో చంద్రాబాబును కలిశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం తీగల కృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు అని కొనియాడారు. మరోవైపు మీడియాతో మాట్లాడకుండానే మల్లారెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్